అమరావతి : వైసీపీకి నెల్లూరు జిల్లాలో గట్టి పట్టు ఉన్నది. ఇప్పటికే 8 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో15, 14,19,27,28,33, 36,44,41,46,35,29,53,4,34,26,9,18,23,39వ డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది.
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో వైఎస్సార్సీపీ జోరు కొనసాగుతున్నది. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో 20 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించగా, మరో 24 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రతిపక్షపార్టీ తెలుగుదేశం ఇప్పటివరకు ఖాతా తెరవలేదు.