తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో (Tirumala ) భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
మొత్తం 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయి కృష్ణతేజ గెస్ట్హౌజ్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 87,347 మంది భక్తులు దర్శించుకోగా 39,490 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 3.13 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.