అమరావతి : అల్లూరి సీతారామరాజు జిల్లాలో నక్సలైట్లు ఓ ప్రైవేట్ బస్సును దహనం చేశారు. జిల్లాలోని చింతూరు మండలం కొత్తూరు వద్ద ఒడిశా నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సును ఆపిన నక్సల్స్ ప్రయాణికులను కిందకు దింపి నిప్పుపెట్టారు.
ఇవాళ దండకారణ్యం బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నక్సల్స్ ఈ చర్యకు పాల్పడినట్లు వెల్లడించారు. కాగా ప్రయాణికులు మరో వాహనంలో గమ్యస్థానాలకు చేరుకున్నారు.