తిరుపతి : తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబరు 3 నుంచి 12వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు (Navratri celebrations) జరుగనున్నాయి.ఈ సందర్భంగా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తామని టీటీడీ అధికారులు (TTD Officers) వెల్లడించారు.
ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం, రాత్రి 7 గంటలకు ఊంజల్సేవ కార్యక్రమం జరుగుతుందన్నారు. అక్టోబరు 12న విజయదశమి (Vijayadasami) సందర్భంగా రాత్రి 7:45 గంటలకు పద్మావతి అమ్మవారు గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. .
ఆర్జిత సేవలు రద్దు
నవరాత్రి ఉత్సవాల కారణంగా 10 రోజుల పాటు కల్యాణోత్సవం సేవను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అక్టోబరు 4, 11వ తేదీలలో లక్ష్మీపూజ, అక్టోబరు 12న ఊంజల సేవలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వివరించారు.