అమరావతి : జాతీయ జెండా జాతి ఐక్యతకు చిహ్నమని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు. విజయవాడ స్వాతంత్య్ర సమరయోధుల సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల భవనంపై సర్వోదయ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమర్చిన 30 అడుగుల మహాత్మాగాంధీ కుడ్య చిత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్రం కోసం త్యాగఫలితమే గాంధీజీని మహాత్ముడిగా కొలుస్తున్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తగా పోరాటాలు, ఉద్యమాలకు మహాత్ముడు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ ప్రతి ఇంటిపై జెండాను ఎగరవేసి ఐక్యతను చాటాలని పిలుపు నిచ్చారు. జాతీయ జెండా రూపశిల్పిని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధురాలిని గవర్నర్ సన్మానించారు.