Nara Lokesh | ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆలయం సింహాద్రి అప్పన్నను (Simhadri Appanna) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకున్న లోకేశ్కు అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న లోకేశ్ బేడ మండపం వద్ద ప్రదక్షిణ చేశారు. అనంతరం అంతరాలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక ఆలయ అధికారులు లోకేశ్కు స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు.