శ్రీశైలం : ఎన్నికల సందర్భంగా తెలంగాణ నుంచి శ్రీశైలంలోకి వెళ్లే మార్గంలో లింగాల వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్టు (Checkpost) ను నంద్యాల ఎస్పీ (Nandyala SP) కె. రఘువీర్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. చెక్పోస్టు వద్ద అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నగదు, బంగారం వెండి విలువైన వస్తువులు, మద్యం అక్రమ రవాణా జరగకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. ఆయన వెంట ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు, శ్రీశైలం టౌన్ ఇన్స్పెక్టర్ జి. ప్రసాదరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.