అమరావతి : రాజకీయం, సినీ రంగానికి చెందిన వ్యక్తులు ఒకరికొకరుపై సానుకూల దృక్పథం కలిగి ఉండాలని సినీ నటుడు నారాయణ మూర్తి పేర్కొన్నారు. గురువారం మచిలిపట్నంలో ఏపీ మంత్రి పేర్ని నానిని మరాద్యపూర్వకంగా కలిసన అనంతరం నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత పట్టింపులకు పోకుండా పరిశ్రమ మనుగడ కోసం, సామాన్య ప్రేక్షకుడి కోసం సినీ పరిశ్రమ బ్రతకాలని అన్నారు.
పరిశ్రమ, ప్రేక్షకుల మేలుకోరి అన్ని వర్గాల వారిని సంతోష పరిచేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు.