అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ఐదు వర్సిటీల పరిధిలో ఉన్న కళాశాలలో స్నాతకోత్సవాలను సకాలంలో పూర్తి చేయాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ సూచించారు. ఈరోజు వర్చువల్ పద్ధతి ద్వారా గవర్నర్ వర్సిటీ వైస్ఛాన్సులర్లతో సమావేశం నిర్వహించారు. కరోనా నష్టం భర్తీచేసేలా వర్సిటీలో అధికారులు కార్యాచరణను చేపట్టాలని ఆదేశించారు. రద్దు చేసిన స్నాతకోత్సవాలను వచ్చే నెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.