అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు మరోసారి వైఎస్ జగన్ పనితీరుపై విరుచుకుపడ్డారు. రోజువారి రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మూడేండ్ల జగన్ పాలనపై తీవ్రంగా స్పందించారు. 95శాతం హామీలు అమలు చేశామని సీఎం చెప్పిన మాటల్లో ఎలాంటి నిజాలు లేవని 95 శాతం నెరవేర్చలేదని వ్యాఖ్యనించారు.
అధికారంలోకి రాగానే మద్యపాన నిషేదం అమలు చేసి 2024లో ఓట్లు అడుగుతామని ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాళా తీశారని ఆరోపించారు. ఒంగోలులో టీడీపీ నిర్వహించిన మహానాడుకు ఏనాడు రాని విధంగా జనాలు రావడాన్ని వైసీపీ గుర్తించి ఆత్మావలోకం చేసుకోవాలని సూచించారు.
ఏపీ మంత్రులు చేపట్టిన సామాజిక చైతన్య యాత్ర విఫలమయ్యిందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ భవిష్యత్ను తలుచుకుంటే భయమేస్తుందని అన్నారు. వైఎస్ జగన్ ఎక్కడా కూడా సామాజిక న్యాయం పాటించడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా అబద్దాలు మానుకోవాలని సూచించారు.