MP MVV Satyanarayana | అమరావతి : వైఎస్సార్ సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఎంపీ ఎంవీవీ భార్య జ్యోతి, కుమారుడు చందుతో పాటు ఆ కుటుంబానికి సన్నిహితుడు, ఆడిటర్, వైసీపీ నేత గన్నమనేని వెంకటేశ్వర్ రావును అపహరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల నేపథ్యంలోనే ఎంవీవీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఎంపీ నగరంలోని లేరని, ఈ క్రమంలో ఆనందపురంలోని కుమారుడి వద్దకు ఆయన భార్య వెళ్లే సమయంలో ఈ కిడ్నాప్ జరిగినట్లు సమాచారం. జ్యోతి, చందు కిడ్నాప్ అయ్యారని సమాచారం తెలియడంతో.. వెంకటేశ్వర్ రావు అక్కడికి వెళ్లడంతో ఆయన్ను కూడా కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిని ఒకే ఇంట్లో నిర్బంధించినట్లు సమాచారం.
అయితే ఈ ఘటన బుధవారమే జరిగిందని, పోలీసులే గోప్యంగా ఉంచి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కిడ్నాపర్ల వివరాలను సాయంత్రం వెల్లడిస్తామని చెబుతున్నారు. నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.