(Rail Rokho) కడప: ఆరు రోజుల క్రితం చెప్పినట్లుగానే కమలాపురం ప్రజాప్రతినిధులు పట్టాలెక్కారు. తామిచ్చిన గడువు పూర్తికావచ్చినా హామీ అమలు కాకపోవడంతో ఎంపీ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు మహా ధర్నాచేపట్టారు. కమలాపురం రైల్వే గేట్ వద్ద బైఠాయించారు. రైలు పట్టాలపై కూర్చుని రైల్ రోకో చేపట్టారు.
పలు రైళ్లు కమలాపురం నియోజకవర్గం పరిధిలోని రైల్వే స్టేషన్లలో నిలుపడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటాద్రి, రాయలసీమ, హరిప్రియ, ముంబై-చెన్నై ఎక్స్ప్రెస్తో పాటు కడప-నంద్యాల రైలును కమలాపురం, కొండాపురం, ముద్దనూరు, నందలూరు స్టేషన్లలో నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కొవిడ్ కారణంగా ఆయా స్టేషన్లలో రైళ్ల స్టాపింగ్ ఎత్తివేశారు. కరోనా తగ్గుముఖం పట్టినా పాత పద్ధతిలో రైళ్లను ఆపడం లేదు. దాంతో ఈ నెల 4 న రైల్వే జీఎంకు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి లేఖ రాసి 10 లోగా సమస్యను పరిష్కరించాలని కోరారు. డెడ్లైన్ పూర్తయినా రైళ్ల నిలుపుదల లేకపోవడంతో ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్రెడ్డి, సుధీర్రెడ్డి, రఘురామిరెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, జడ్పీ చైర్మన్ అమర్నాథరెడ్డి తదితరులు రైల్రోకో నిర్వహించారు.
ఎంపీ, ఎమ్మెల్యేల రైల్ రోకో సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు, రైల్వే పోలీసులు భద్రతా చర్యలను చేపట్టారు. పాత పద్ధతిలోనే ఆయా స్టేషన్లలో రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డు చైర్మన్కు ఎంపీ అవినాష్రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని ఎంపీ చెప్పారు. రైల్రోకో సందర్భంగా పలు రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
యాస్ప్రిన్ టాబ్లెట్ వేసుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి
ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ డైట్.. దీని ప్రత్యేకత ఏంటంటే..?!
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..