అమరావతి : ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం చల్లవానిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు దుర్మరణం చెందారు. ద్విచక్రవాహనంపై బయలు దేరిన కొద్ది సేపటికే కల్వర్ట్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలంలోనే తల్లి రమణమ్మ, కొడుకు మణికంఠ మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.