అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఆవనిగడ్డ మండలం ఆశ్వరావుపాలెంలో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ట్రాక్టర్ తల్లీకూతుళ్లను ఢీ కొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు శ్రీవల్లి, ప్రహాస్గా గుర్తించారు . పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.