గుంటూరు జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 94 వేలకు పైగా కేసులు లోక్ అదాలత్లో పరిష్కారమయ్యాయి. రాష్ట్రంలో 380 లోక్ అదాలత్ బెంచ్లు ఏర్పాటయ్యాయి. వీటిలో 87,805 పెండింగ్ కేసులు, 6,458 ప్రీ లిటిగేషన్ కేసులు, వివిధ జిల్లాల్లో 451 కేసులు పరిష్కరమైనట్లు ఏపీ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ఎం బబిత పేర్కొన్నారు. ఈ కేసులకు సంబంధించి మొత్తం రూ.93.07 కోట్లు సెటిల్మెంట్గా ఉన్నట్లు ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిషా అధ్యక్షతన జరిగిన లోక్ అదాలత్లో హైకోర్టులో పెండింగ్లో ఉన్న 451 కేసులను పరిష్కరించారు. పరిష్కరించిన కేసుల్లో రూ.3.34 కోట్లను న్యాయవాదులకు అందజేశారు. జాతీయ లోక్ అదాలత్లో భాగంగా హైకోర్టులో మూడు బెంచ్లు ఏర్పాటయ్యాయి. ఇందులో మొదటి బెంచ్లో హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ శేషసాయి, రెండవ బెంచ్లో జస్టిస్ బీ కృష్ణమోహన్, మూడవ బెంచ్లో జస్టిస్ కే సురేష్ రెడ్డి ఉన్నారు. న్యాయవాదులు టీఎస్ రాయలు, కేవీ దుర్గా దివాకర్, కొలుసు రవికిరణ్ సభ్యులుగా ఉన్నారు. న్యాయవాదుల సంపూర్ణ మద్దతు, ప్రజల భాగస్వామ్యంతో సంబంధిత శాఖల అధికారులు, కోర్టు సిబ్బంది జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేశారని బబిత చెప్పారు.