అమరావతి : శుభకృథ్ నామ సంవత్సరంలో శుభాలు జరుగుతాయని పంచాంగాలన్నీ చెబుతున్నట్లుగానే రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేసే బలం ప్రభుత్వానికి రావాలని భగవంతున్ని కోరుతున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. దేవుడి దయ, ప్రజలందరీ దీవేనలతో రాబోయే సంవత్సరమంతా ప్రభుత్వం మరిన్నీ కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తాడెపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు ఈ వేడుకలకు హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించారు. దేవాదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. శుభకృత్ నామ సంవత్సరం.. పేరుకు తగ్గట్లుగానే ఈ సంవత్సరం అన్నీ శుభాలే జరుగతాయని సిద్ధాంతి చెప్పారు. ప్రభువుల చల్లని పాలనకు తగ్గట్లే ప్రజలూ హాయిగా ఉంటారని, చాలా మంచి పథకాలతో ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఈ ప్రభుత్వానికి దొరుకుతుంది తెలిపారు. అనంతరం పంచాంగకర్తను సీఎం వైఎస్ జగన్ సన్మానించారు.