హైదరాబాద్ : భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వెంకయ్యనాయుడు దశాబ్దాలుగా దేశానికి విశేష సేవలందించారని మోదీ ప్రశంసించారు. ఆయనకు వ్యవసాయం, గ్రామీణాబివృద్ధిపై మక్కువ ఎక్కువ అని పేర్కొన్నారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందని, నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఆత్మీయులు వెంకయ్యనాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు .తెలుగు పలుకు, సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు రూపం వెంకయ్యనాయుడని అన్నారు. ఏ పదవైనా ప్రజాసేవ, ప్రజాస్వామ్య విలువలు మరువలేదని వెల్లడించారు.