అమరావతి : ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ద్రోణి కొనసాగుతున్నది.
పశ్చిమ బెంగాల్ , సిక్కిం నుంచి దక్షిణ ఒడిశా తీరం వరకు ఇది వ్యాపించి సముద్ర మట్టానికి 2.1 కిలోమీటర్లు ఎత్తున ఉంది.
నైరుతి బంగాళాఖాతం దగ్గర ఉన్న ఉత్తర తమిళనాడు తీర ప్రాంతం మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. సముద్ర మట్టానికి 2.1 కిలోమీటర్లు నుంచి 3.6 కిలోమీటర్ల మధ్య ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి