అమరావతి : ఆంధ్రప్రదేశ్లో జరుగబోయే ఎన్నికల్లో టికెట్లు లభించని నాయకులు ఆయా పార్టీల తీరుపై తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి మారిన తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి (MLA Undavalli Sridevi ) పార్టీ పేరు, వ్యక్తుల పేర్లు ప్రస్తావించకుండానే శుక్రవారం సోషల్ మీడియా (Social Media) ద్వారా వినూత్నంగా నిరసన తెలిపారు.
‘ రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థం అయ్యిందని ’ పేర్కొంటు బాపట్లను ట్యాగ్ చేస్తూ పక్కనే కత్తి సింబల్తో ట్వీట్ చేశారు. 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె రెండు సంవత్సరాల క్రితం సీఎం జగన్ విధానాలు నచ్చక టీడీపీలో చేరారు.
వచ్చే ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్ స్థానమైన తిరువూరు గాని , బాపట్ల ఎంపీ అభ్యర్థిగా గాని చంద్రబాబు ప్రకటిస్తారని భావించిన ఆమెకు నిరాశే ఎదురయ్యింది. శుక్రవారం చంద్రంబాబు ప్రకటించిన మూడో జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తికి లోనై వినూత్నంగా నిరసన తెలుపుతూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది .
రాజకీయాలు ఎలా ఉంటాయో..
ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థం అయ్యింది!! #Bapatla 🗡️ pic.twitter.com/6Mhl0KY7t4— MLA Dr Vundavalli Sridevi (@MlaSrideviDr) March 22, 2024