శ్రీశైలం: శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుటుంబసభ్యులతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వీరికి అర్చక వేదపండితులు, అధికారులు తిలకధారణ చేసి స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారి గర్భాలయంలో అభిషేకం, వృద్ధమల్లికార్జున స్వామికి బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారి ప్రాకారంలోగల ఆశీర్వచన మండపంలో వేదాశీర్వచనం చేసి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రం, ఙ్ఞాపికను అందజేశారు.