అమరావతి: కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఆలయంలో భక్తులకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. స్వామివారిని దర్శించుకునేందుకు దక్షిణ మాడవీధిలో క్యూలో నిలబడ్డ భక్తుల వైపు లారీ అదుపుతప్పి దూసుకురావడంతో భక్తుల కేకలతో సిబ్బంది అప్రమత్తమై ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టారు.
ఆలయంలో తయారు చేసే లడ్డు పదార్థానికి కావాల్సిన నెయ్యి క్యాన్లను తీసుకొచ్చిన లారీకి బ్రేక్ ఫెయిల్ కావడంతో లారీ ఒక్కసారిగా భక్తుల వైపు రావడం ప్రారంభించింది. ఆలయ , సెక్యూరిటీ సిబ్బంది గమనించి అప్రమత్తమై లారీకి అడ్డంగా రాళ్లు వేసి ఆపివేశారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.