అమరావతి : ఏపీలోని చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వి.కోట మండలం రహమత్నగర్లో జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం ఉదయం వాకింగ్ చేస్తున్న జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డిని ఇద్దరు దుండగులు కత్తులతో పొడిచి హతమార్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.