అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయభేరి ’ పేరిట నాలుగురోజుల పాటు కొనసాగనున్న మంత్రుల బస్సుయాత్ర శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైంది . ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన 17 మంది మంత్రులు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు ధర్మనా ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, పీసల అప్పరాజు మాట్లాడుతూ .. ఏపీ సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సామాజిక విప్లవం దేశమంతా అవలంభించాలని సూచించారు.
రాష్ట్రంలో 82 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే అందజేస్తున్నామని అన్నారు. కులాలకు ఎన్ని నిధులు ఇస్తున్నామని ముఖ్యం కాదని వారిని రాజ్యంగ పరంగా ఉన్న హక్కులను అందివ్వడమే ప్రధానమని పేర్కొన్నారు. సమసమాజ స్థాపనకు వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని వెల్లడించారు. వెనుకబడ్డ తరగతుల వారికి అట్టడగు స్థాయి నుంచి రాజకీయం వరకు అవకాశాలు కల్పిస్తున్నారని ప్రసంశించారు.