తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంత్రి మల్లారెడ్డి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని 175 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను గెలిపిస్తే కాళేశ్వరం తరహాలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తాన్నారు. రాష్ట్రానికి ఇప్పటివరకు ప్రత్యేక హోదా రాలేదని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా మంచి స్పందన వస్తున్నదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో గత ఏమిదేండ్లలో తెలంగాణలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు పార్టీని ఆదరిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామన్నారు. విజయం సాధించడం ఖాయమన్నారు.