అమరావతి : ప్రశ్నపత్రాల లీక్ల వ్యవహారాన్ని అరికట్టడంలో విద్యాశాఖ మంత్రి విఫలమయ్యారంటూ ఏబీవీపీ నాయకులు బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. కార్యాలయంలోకి చొచ్చుకెళ్తుందుకు ప్రయత్నించిన ఏబీబీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురు మధ్య తోపులాట జరిగింది . నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి బొత్స వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రశ్నపత్రాల లీక్లతో విద్యార్థులు భవిష్యత్ను కోల్పోయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా వరుసగా పత్రాల లీక్లు జరుగుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.