Heavy Rains | హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఏపీకి మిచాంగ్ తుఫాను ముప్పు పొంచిఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం నాటికి తుఫాను మచిలీపట్నం సముద్ర తీరం దాటనున్నదని పేర్కొన్నది.
ఈ ప్రభావంతో ఆదివారం నుంచి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను కారణంగా అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అలర్ట్ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.