అమరావతి : ఆంధ్రప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్( IAS) , ఐపీఎస్ (IPS ) లను బదిలీ( Tranfers) చేసింది. మొత్తం 31 మంది అధికారులను బదిలీ చేయడం సంచలనం రేపింది. కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్గా చక్రధర్బాబు, వ్యవసాయశాఖ డైరెక్టర్గా మనజీర్జిలానీ సామున్, ఏపీపీఎస్సీ సెక్రటరీగా రవిసుభాష్ ను నియమించింది. ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీగా శివశంకర్ లోతేటి, పౌరసరఫరాలశాఖ వైస్ చైర్మన్గా ఎస్.ఢిల్లీరావు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా పి. రంజిత్ బాషాను నియమించింది.
హౌసింగ్ కార్పొరేషన్ వైస్ సీఎండీగా అరుణ్ బాబు, సీసీఎల్ఏ సెక్రటరీగా జె.వి. మురళి, జాయింట్ సెక్రటరీగా టీఎస్ చేతన్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వైస్ చైర్మన్గా బి.నవ్య,ఎయిర్పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య , ఐ అండ్ పీఆర్ డైరెక్టర్గా కె,ఎస్ విశ్వనాథన్, పౌరసరఫరాలశాఖ డైరెక్టర్గా గోవిందరావు, ఏపీ ఎస్సీ కమిషన్ సెక్రటరీగా ఎస్.చిన్న రాముడు, ఏపీ ట్రాన్స్కో జేఎండీగా జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ను ప్రభుత్వం నియమించింది.