అమరావతి : ఏపీలోని శ్రీకాళహస్తీలో రాత్రి భారీ చోరీ జరిగింది. ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో రాత్రి దొంగలు పడి రూ. కోటీని దుండగులు ఎత్తుకెళ్లారు. కంపెనీ మహిళా మేనేజర్ ఆడిటింగ్ చేస్తుండగా దుండగులు బ్యాంక్లో చొరబడ్డారు. మహిళా సిబ్బందిని బెదిరించి , వారిని నిర్బంధించి డబ్బు, నగలతో పరారీ అయ్యారు. దుండగలు ముందుజాగ్రత్తగా సీసీ కెమెరా రికార్డర్ను ఎత్తుకెళ్లారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు డీఎస్పీ విశ్వనాథ్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దుండగుల ఆచూకి కోసం డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తును ప్రారంభించారు. సమీప సీసీ కెమెరాల ఫుటేజిని పోలీసులు పరిశీలిస్తున్నారు.