తిరుపతి: ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు విద్యార్థులు బీభత్సం సృష్టించారు. తమిళనాడులోని ఓ ప్రైవేటు లా కాలేజీకి చెందిన విద్యార్థులు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శించుకుని తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఏపీ సరిహద్దుల్లోని ఎస్వీ పురం టోల్ ప్లాజా వద్ద వారి కారు ఆగింది. అయితే వారికారుకు ఉన్న ఫాస్టాగ్ పనిచేయకపోవడంతో డబ్బు చెల్లించాలని, కారు పక్కకు తీస్తే మిగతా వాహనాలు వెళ్తాయని టోల్ప్లాజా ఉద్యోగి సుచించారు. అయితే ఆగ్రహం వ్యక్తంచేసిన విద్యార్థులు అతనితో వాగ్వాదానికి దిగారు. అదికాస్తా గొడవకు దారితీయడంతో.. విద్యార్థులు టోల్గేట్ సిబ్బందిపై దాడి చేశారు.
ఇదంతా చూస్తున్న స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే వారిపైకూడా విద్యార్థులు దాడిచేయడంతో.. టోల్ప్లాజా రణరంగంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే కొద్దిసేపు అక్కడే ఉన్న విద్యార్థులు ఏపీ రిజిస్ట్రేషన్తో ఉన్న వాహనాలు అడ్డుకుని తమిళనాడుకు చెందిన వెహికిల్స్ను వదిలేశారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని వారిని అక్కడినుంచి పంపించివేశారు.