Road Accident in Chittoor | చిత్తూరు జిల్లా పూతలపట్టులో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న పెండ్లి ట్రాక్టర్ లక్ష్మయ్య ఊరు సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ సహా ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి స్విమ్స్, వేలూరు సీఎంసీకి తరలించారు. బాధితులను ఐరాల మండలం బలిజపల్లికి చెందిన వారిగా గుర్తించారు.
ఇదే పూతలపట్టు మండలానికి సమీపంలోని కాణిపాకం వద్ద గత నెలలో కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న పాలట్యాంకర్ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం చెందారు.