అల్లూరి జిల్లా : మావోయిస్టు మిలీషియా సభ్యులు, సానుభూతిపరుల దళాలు లొంగిపోయాయి. దాదాపు 60 మంది పెదబయలు మావోయిస్టు కమిటీ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. వీరి నుంచి నగదుతోపాటు ల్యాండ్మైన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాలను డీఐజీ హరికృష్ణ మీడియాకు వెల్లడించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టు మిలీషియా సభ్యులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. మొత్తం 60 మంది లొంగిపోగా.. వీరిలో కోరుకొండ ఏరియా మావోయిస్టు సభ్యులు 33 మంది, మిలీషియా సభ్యులు 27 మంది ఉన్నారు. వీరిలో 8 మంది మహిళలు. వారి నుంచి రూ.39 లక్షల నగదు, ల్యాండ్ మైన్లు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు చేసిన వారిలో పెదబయలు, కోరుకొండ ఏరియా కమిటీ సెక్రెటరీ రామకృష్ణ అలియాస్ అశోక్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అశోక్ దాదాపు 124 వివిధ విధ్వంసక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు పోలీసు రికార్డులు చెప్తున్నాయి. ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో ఆయుధ డంపులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ తెలిపారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామని, వారిపై ఉన్న రివార్డును వారికే అందేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.