అమరావతి : అల్లూరి జిల్లా ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దులో పోలీసులు మావోయిస్టు డంపు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు మల్కన్గిరి జిల్లా జొడొంబో పోలీస్స్టేషన్ పరిధిలోని అటవి ప్రాంతంలో ఒడిస్సా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒకచోట నిలువ ఉంచిన డంప్లో మూడు తుపాకులు, 18 మందుపాతర్లు, గ్రెనేడ్స్, డిటొనేటర్స్ను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న డంప్ ఆంధ్రా ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీకి చెందినవిగా అనుమానిస్తున్నామని, ప్రజల రక్షణకు పోలీసులు కుంబింగ్ నిరంతరం నిర్వహిస్తామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.