అమరావతి : ఏపీ పోలీసులు ఇవాళ ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దులో మావోయిస్టుల డంపును స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి జిల్లా పెద్దబయలు మండలం జక్కం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తు న్నారని అందిన సమాచారం మేరకు పోలీసు బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా అటవీప్రాంతంలో ఒక చోటు పోలీసుల కుంబింగ్లో మావోయిస్టు డంపును స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ వెల్లడించారు. డంపులో పేలుడు పదార్ధాలు, విప్లవ సాహిత్యం లభ్యమైందని అన్నారు.