అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ (IAS) లకు పోస్టింగ్ (Postings) లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఎన్నికల సంఘం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. వీరికి ఎన్నికలతో సంబంధం లేని శాఖలకు పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆరోగ్యశ్రీ ట్రస్టు (Aarogya Sri Trust ) సీఈవోగా లక్ష్మీషా, స్కిల్ డెవలప్మెంట్ ఎండీగా రాజాబాబు, టీటీడీ జేఈవోగా గౌతమి, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్గా అంబేద్కర్ను నియమించింది. పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీగా వెంకట్రామిరెడ్డి, సీసీఎల్ఏ కార్యదర్శిగా ప్రభాకర్రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించింది.