అమరావతి : ఏపీలో జరుగనున్న అసెంబ్లీ(Assembly), లోక్సభ(Loksabha) ఎన్నికలకు సమయం ఆసన్నమయ్యే కొలది ఆయా ప్రధాన పార్టీలు పెండింగ్లో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నారు. అధికార వైసీపీ ఒకేసారి అందరి అభ్యర్థుల పేర్లను ప్రకటించగా కూటమిలో భాగస్వా్మ్యమైన టీడీపీ, జనసేన, బీజేపీలు ఒకటి, రెండు మినహా అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. జనసేన (Janasena) మాత్రం అభ్యర్థుల ఎంపిక చేయడంలో జాప్యం చేస్తుంది.
గురువారం ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఆవనిగడ్డ (Avanigadda) అసెంబ్లీ అభ్యర్థి పేరును, రైల్వేకోడూరులో మార్చిన అభ్యర్థి పేరును ప్రకటించారు. టీడీపీలో సీనియర్ నాయకుడు బుద్ద ప్రసాద్ (Budda Prasad) టీడీపీ నుంచి అవకాశం దక్కకపోవడంతో రెండు రోజుల క్రితం జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు ఆవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ను కెటాయించారు. ఇక రైల్వే కోడూరు (Railwaykoduru) లో జనసేన అభ్యర్థిగా యనమల భాస్కర్ పేరును ప్రకటించగా ఆయనను తప్పించి అరవ శ్రీధర్కు అవకాశం కల్పించారు.