శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటలో భార్య, అత్తను అల్లుడు గొంతుకోసి చంపేశాడు. ఆపై అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ కలహాలతో అప్పన్న అనే వ్యక్తి తన భార్య, అత్తను కత్తితో గొంతు కోసేశాడు. దీంతో వారు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు.
అడ్డుకోబోయిన మరో ముగ్గురిపై దాడి చేశాడు. అనంతరం అదే కత్తితో తాను పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులు దవాఖానకు తరలించారు. నిందితుని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.