విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం ఏనుగులపాలేంలో విద్యుత్లైన్మెన్ బంగార్రాజు హత్యకేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం డీసీపీ గౌతమి సాలి విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కోరాడ గోవింద్ అనే వ్యక్తి తనకు రాజకీయ పలుకుబడి ఉందని,విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని పేర్కొనడంతో బంగార్రాజు నమ్మి నిరుద్యోగులు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 3లక్షల నుంచి రూ.3.50లక్షల వరకు మొత్తం రూ.30లక్షల వరకు వసూలు చేసి కోరాడ గోవింద్కు ఇచ్చాడు.
రోజులు గడుస్తున్నా గోవింద్ ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో వీరిద్దరి మధ్య మనస్పర్థాలు ఏర్పడ్డాయి. ఈ దశలోనే అక్టోబర్ 31న కోరాడ లక్ష్మణరావు గెస్టహౌస్ పక్కన బంగార్రాజు హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేయడంలో జాప్యం చేస్తున్నారంటూ పోలీసులపై ఆరోపణలు రావడంతో బంగార్రాజు భార్య ఫిర్యాదు మేరకు దర్యాప్తును ముమ్మరం చేసి ప్రధాన నిందితుడు కోరాడ గోవింద్ను అరెస్టు చేశామని డీసీపీ వెల్లడించారు. బంగార్రాజు హత్యకేసులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ హత్యలో కోరాడ లక్ష్మణరావు, వెంకటేశ్, పైడిరాజుల హస్తం ఎంతవరకు ఉందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.