నంద్యాల : శ్రీశైల (Srisailam) క్షేత్రంలో మహాకుంభాభిషేక(Mahakumbha Abhishekam) మహోత్సవాలు వైభవంగా ముగిసాయి. ఈనెల 16న ప్రారంభమైన ఉత్సవాల చివరి రోజు బుధవారం కంచికామకోటి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతీ, శ్రీశైల జగద్గురు పీఠాధిపతులు చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య, పుష్పగిరి పీఠాధిపతులు విద్యాశంకర భారతీ, కాశీ పీఠాధిపతి మల్లికార్జున విశ్వరాధ్య శివాచార్చ మహాస్వామి పాల్గొని పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధానాలయంలో శివాజీగోపుర పునర్మిర్మాణం, ఉ పాలయాల పునరుద్ధరణ, శివలింగ, నందీశ్వరుల ప్రతిష్టాపన, మహాకుంభాభిషేకం నిర్వహించారు. కుంభాభిషేకం నిర్వహణ వల్ల చతుర్విధ పురుషార్థసిద్ధి, మానసిక ప్రశాంతత, అధ్యాత్మిక పరిపుష్టి, ఆయుర్వృద్ధి, కీర్తి జయం కలుగుతాయని, శారీరక, మానసిక వ్యాధులు నశిస్తాయని, సకల ఆపదలు తొలుగుతాయని పీఠాధిపతులు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ(Minister Satyanarayana) , నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందారెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఏపీ దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కలికాల్ వళవన్, కమిషనర్ సత్యనారాయణ, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి , సభ్యులు పాల్గొన్నారు.