అమరావతి : ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో మాజీ మంత్రిని తమ సమస్యలపై నిలదీసిన మహిళ లలితాబాయి ఇంట్లో పోలీసులు కర్నాటక మద్యంను స్వాధీనం చేసుకున్నారు.జిల్లాలోని కొత్తచెరువు గ్రామంలో ఆమె నిన్న గడప గడప కార్యక్రమానికి వచ్చిన మాజీ మంత్రి శంకర నారాయణను నిలదీశారు.
గత 11 నెలలుగా తనకు రావాల్సిన పింఛన్ను అధికారులు నిలిపివేశారని మాజీ మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఆయన ఆమె ఆవేదనను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గిరిజన మహిళ లలితాబాయి వైసీపీ నాయకులను దుమ్మెతిపోశారు. నిలబడి సమస్యలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడం బావ్యం కాదంటూ ఆమెతో పాటు మరికొందరు మహిళలు శంకరనారాయణను, వైసీపీ నాయకులను , అధికారులను నిలదీశారు.
కాగా లలితాబాయి ఇంట్లో రాత్రి పోలీసులు సోదా నిర్వహించి ఆమె ఇంట్లో నిల్వ ఉంచిన కర్నాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని సొంత పూచికత్తుపై విడుదల చేశారు.