Leopard | కర్నూల్ : కర్నూల్ జిల్లా పెద్దకడబూరు మండలం హనుమాపురం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందింది. ఆదోని నుంచి ఎమ్మిగనూరు వైపు వెళ్లే మార్గంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెంది ఉంటుందని అటవీశాఖ అధికారులు, పోలీసులు అనుమానిస్తున్నారు. చిరుత కళేబరాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.