శ్రీశైలం: ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా శ్రీశైలం (Srisailam) సమీపంలోని పాలధార పంచదార వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి (Leopard) మృతి చెందింది. ఈ ప్రాంతంలో గతంలో పలుమార్లు రాత్రి వేళలో భక్తులు, స్థానికులకు చిరుతపులి కంటపడింది.
విషయం తెలుసుకున్న సున్నిపెంట (Sunnipenta) రేంజ్ ఆఫీసర్ నర్సింహులు ఆధ్వర్యంలోని బృందం ఘటన స్థలానికి చేరుకున్నది. చిరుతపులి కలేబరాన్ని సున్నిపెంటకు తరలించారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించనున్నారు. చిరుత వయస్సు ఆరు నెలలు ఉంటుందని అధికారులు చెప్పారు.