అమరావతి : ఈనెల 24 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న భూముల రీసర్వే ట్రైనింగ్ పరీక్షలు వాయిదా వేయాలని ఏపీ వీఆర్వోల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఆరు జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నామని వారు వెల్లడించారు. ఈ నెల 24 నుంచి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు తొలివిడత పరీక్షలకు షెడ్యూల్ జారీ చేశారని వివరించారు.
వరద ప్రాంతాల్లోని వీఆర్వోలు పరీక్షలకు హాజరయ్యే పరిస్థితి లేదని పేర్కొన్నారు. పరీక్షలను వాయిదా వేయాలని వారు కోరారు.