అమరావతి : రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణ ప్రాంతాన్ని ఈ నెల 5న కృష్ణాబోర్డు ప్రతినిధులు పరిశీలించనున్నారు. పోతిరెడ్డిపాడు వద్ద చేపట్టిన ఎత్తిపోతల పనులను బోర్డు ప్రతినిధులు పరిశీలించనున్నారు. ఈ మేరకు బోర్డు ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఇదిలాఉండగా రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు వచ్చే బృందంలో తెలంగాణ ప్రతినిధులు ఎవరూ ఉండకూడదని ఏపీ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు నిబంధన విధించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేఆర్ఎంబీ బృందం పర్యటించనుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించి కేఆర్ఎంబీ ప్రతినిధులు ఎన్జీటీకి నివేదిక ఇవ్వనున్నారు. గతంలో సందర్శనకు వస్తామన్నా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే.