అమరావతి : ఉత్కంఠగా మారిన కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ప్రకియ ముగిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రక్రియను ఎన్నికల అధికారులు పూర్తి చేయగా.. ఎన్నికల ఫలితాలను ఎస్ఈసీ సీల్డ్ కవర్లో ఉంచి హైకోర్టుకు సమర్పించనున్నారు. ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫీషియో సభ్యత్వంపై హైకోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు ఎవరనే విషయం తెలనున్నది. ఎన్నికకు ముందు వార్డు సభ్యులతో అధికారులు ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక జరిగిందని చెప్పారు. చైర్మన్గా చెన్నుబోయిన చిట్టిబాబును, వైస్ చైర్మన్లుగా ధరణికోట శ్రీలక్ష్మి, శ్రీనివాస్ చుట్టుకుదురును ప్రతిపాదించినట్లు చెప్పారు. ఎంత ప్రలోభ పెట్టినా టీడీపీ కౌన్సిలర్లు తప్పుకోలేదన్నారు. టీడీపీ తరఫున 15 మంది కౌన్సిలర్లు భయపడలేదని పేర్కొన్నారు. తన నోటు కోర్టు నిర్ణయించి, తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. తాను ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.