తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 19న ఉగాది( Ugadi ) ఆస్థానాన్ని పురస్కరించుకుని మార్చి 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam ) నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు ( VIP break darshans) , అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేసినట్లు వివరించారు. 16న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని పేర్కొన్నారు. అదేవిధంగా మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని , ఈ కారణంగా మార్చి 18వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని వివరించారు.