తిరుమల : తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 9న క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిlg సందర్భంగా మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని (Koil Alwar Thirumanjanam) టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Chairman Karunakar reddy) , ఈవో ఎవి.ధర్మారెడ్డి తదితరులు పాల్గొని ఆలయ శుద్ధిలో పాల్గొన్నారు.
చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఉగాది(Ugadi) , ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఉగాది పండుగ నేపథ్యంలో ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు.
ఆలయంలో ఉదయం 6 నుంచి ఉదయం 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎల్వో వీర్రాజు, డిప్యూటీ ఈవో లోకనాథం, పెష్కార్ హరి పాల్గొన్నారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 16 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వివరించారు. నిన్న స్వామివారిని 62,439 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 22,027 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా కానుకల వల్ల హుండీకి రూ. 3.61 ఆదాయం సమకూరిందని వెల్లడించారు.