Tirupati | తిరుపతిలో విద్యార్థి నేతల కిడ్నాప్ కలకలం రేపింది. చంద్రగిరి పరిధిలోని మోహన్బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ, అక్రమాలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీయూ విద్యార్థి నాయకుడు వినోద్లను తిరుచానూరు సమీపంలో కిడ్నాప్ చేశారు. దాదాపు 30 మంది వారిని ఓ వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు.
ఈ విషయం తెలుసుకున్న సీపీఎం నేత కందారపు మురళి.. ఎస్పీ సుబ్బరాయుడికి సమాచారం ఇచ్చారు. దీంతో తిరుచానూర్ సీఐ సునీల్ కుమార్ నేతృత్వంలోని మూడు బృందాలు కిడ్నాపర్లను వెంబడించి గంటన్నరలోనే పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని వాహనాలను సీజ్ చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు మోహన్బాబును ఏ -2గా, మంచు విష్ణును ఏ-3గా, యూనివర్సిటీ PRO సతీష్ను ఏ-1గా చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు.