అమరావతి : ఏపీలో జరుగనున్న ఎన్నికలకు పోటీ చేసే టీడీపీ(TDP)-జనసేన(Janasen) ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనపై వైసీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna reddy) , వైసీపీ విశాఖ ప్రాంతీయ సమన్యయ కర్త వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పవన్కల్యాణ్ దయనీయంగా మారారని, జనసేన అభ్యర్థుల పేర్లను కూడా చంద్రబాబే డిసైడ్ చేసే కర్మ పట్టిందని ఆరోపించారు. టీడీపీకి పవన్కల్యాణ్(Pawan Kalyan) ఉపాధ్యక్షుడు అయితే బాగుంటుందని సూచించారు.
జనసేన టీడీపీ అనుబంధ సంఘంగా మారిందని విమర్శించారు. చంద్రబాబు(Chandra Babu) కళ్లలో ఆనందం చూడడానికే పవన్ కల్యాణ్ ఏపీలో 24 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. శనివారం ఉండవల్లిలో చంద్రబాబు, పవన్కల్యాణ్ 99 మంది పేర్లతో ఉమ్మడి తొలి జాబితాను ప్రకటించారు. వీటిలో తెలుగదేశం 94 స్థానాలు, జనసేన 5 స్థానాల అభ్యర్థులను పేర్లను వెల్లడించారు. త్వరలో బీజేపీతో పొత్తు అనంతరం మిగతా సీట్లను మూడు పార్టీలు ప్రకటించే అవకాశముంది.