అమరావతి : టీడీపీ నుంచి వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani ) మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏపీలో అధికారం కోసం చంద్రబాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు కూడా మోసం చేస్తారని, తన కొడుకు నారా లోకేష్ను సీఎం చేయాలన్నదే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు.
రెండు సార్లు టీడీపీ ఎంపీగా గెలిచానని, విజయవాడలో కార్పొరేషన్తో పాటు సర్పంచు, ఎంపీటీసీ, జడ్పీ, మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను తాను గెలిపించానని వెల్లడించారు. తనను టీడీపీ(TDP) నుంచి దూరం చేస్తే వైఎస్ జగన్ అక్కున చేర్చుకున్నారని వివరించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి 54 సీట్లే వస్తాయని సర్వేలు చెబుతున్నాయని జోస్యం చెప్పారు.
అమరావతి(Amaravati ) పేరిట భూములను తీసుకుని రైతులను మోసం చేశారని ఆరోపించారు. 30 సంవత్సరాలు అయినా అమరావతి అభివృద్ధి చెందదని బాబుకు వివరించానని, బెజవాడలో ఎయిర్పోర్టు రాకుండా చంద్రబాబు కుట్ర చేశారని విమర్శించారు. ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే రాష్ట్రంలో గందళగోళ పరిస్థితులే ఉంటాయని పేర్కొన్నారు.