తిరుపతి : కార్తిక బ్రహ్మోత్సవాల్లో (Karthika Brahmotsavam ) భాగంగా మంగళవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అలమేలు మంగ మోహినీ అలంకారంలో పల్లకీలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలోని కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు.
కాగా తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న 70,902 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 22,858 మంది దర్శనం(Darsan) చేసుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.24 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 24 కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో స్వామివారి దర్శనం లభిస్తుందని వివరించారు.